Thursday, November 8, 2012

ఇది కధ కాదు 3 : రాజు పంజా...!

 రాజు బయలుదేరాడు.. నేపాల్ కి కాదు. గూడెం తాలాకా కి ప్రధాన కేంద్రం అయిన చింతపల్లికి దగ్గర లో ఉన్న పెద్దవలస.ఎవడైతే అధికార గర్వం తో, అమాయక ప్రజల మీద తన రాక్షసత్వాన్ని చూపించి వారికి నరకం చూపిస్తున్నాడో..ఆ తహశీల్దార్ "బాస్టియన్" ఉండే చోటుకి కనుచూపు మేరలోని ఊరది.

ప్రజల దృష్టిలో ఫితూరీ అంటే ఒక దుందుడుకు చర్య. అల్లర్ల తో కొత్త సమస్యలని తెచ్చే అక్కర్లేని గోల.గతం లో జరిగిన తిరుగుబాట్లన్నీ ఆర్ధికం గా, నైతికం గా సామాన్య ప్రజల మీదే ఆధారపడ్డాయ్.అయితే అది ఎప్పుడయితే అదనపు భారమయ్యిందో , ఎప్పుడయితే కొత్త సమస్యలు తీసుకొచ్చిందో అప్పుడే ప్రజలకి ఉద్యమం మీద గౌరవం, నమ్మకం వాటితో పాటూ సహకారం తగ్గాయి.చాలా మంది దృష్టి లో "ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టడానికి ఒక అవకాశం" మాత్రమే.

అయితే.. రామరాజు ప్రజలలో ఆ భావనలని పోగొట్టడానికి ప్రయత్నించాడు. గతంలో జరిగిన తప్పులని పునరావృతం కాకుండా ఉండేలా చూశాడు. అప్పికే ప్రిాజ ఉన్నమ్మం, గౌరం, క్తి,  ితూరీ కి మద్దు ఇచ్చేలా చేసింది.గంటందొర, మల్లు దొర, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు, కర్రి కణ్ణిగాడు, పనసల కణ్ణయ్య పడాల్ మొదలగు వారందరూ రామరాజు ప్రధాన అనుచరులుగా పెద్దవలస చేరారు.

తనేం చెయ్యాలనుకుంటున్నాడో చెప్పే ముందు, తనకెలాంటి ఉద్యమకారులు కావాలో, తన సిద్ధాంతాలేమిటో వివరంగా చెప్పాడు శ్రీ రామరాజు.

రామరాజు తన సైన్యానికి ఉద్భోధించిన విషయాలుః

1. ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం చేసే ఈ ఉద్యమం లో ప్రతీ ఉద్యమకారుడి పోషణా ప్రజలే చూసుకోవాలి. కానీ అది వారికి భారం కాకూడదు. తాము తిరిగే పల్లె లో ఒకటి - రెండు పూటలకి కావల్సిన భోజన సామాగ్రి మాత్రమే తీసుకోవాలి.

2. క్రమశిక్షణ, బ్రహ్మచర్యం, దుర్వ్యసనాలకి దూరం గా ఉండటం, స్తీల యెడల మాతృభావన కలిగి ఉండాలి.

3. ఉద్యమం అంటే హింసకి ప్రతి హింస కాదు. ప్రజా సంక్షేమం కోసం పాలక వ్యవస్థ మీద నిరసన. కనుక, గతి లేక తెల్లవాడి కింద పని చేస్తున్న ఏ ఒక్క భారతీయుడూ బలి  కాకూడదు. వాడు పోలీసయినా, వేరే ఏ అధికారి అయినా. 
"మన జోలికొస్తే చంపెయ్యగలం" అని వాళ్లకి తెలియాలి. చావు భయం కలిగించాలి గానీ అనవసర హింస కూడదు.
4. ఈ పోరాటం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బంది పడకూడదు. అవసరమైనదాని కంటే ఎక్కువ సహాయాన్ని (వస్తు,ధన రూపేణా) అందించడానికి సిద్ధం గా ఉన్నాసరే, దాన్ని నిరాకరించాలి

5. మన్యం లో కత్తులకీ, విల్లమ్ములకీ, నాటు తుపాకీ లకీ కొదవ లేదు కానీ శత్రువు బలమైన వాడు కాబట్టీ తగిన ఆయుధాలు సమకూర్చుకోవాలి.

ఎలా?? ఆయుధాలు ఎలా వస్తాయ్??
రాజు మనసులో ఆలోచన.. "పోలీస్ స్టేషన్ల పై దాడి". ఈ ఆలోచన ఇప్పటిది కాదు అప్పటికి కొన్నేళ్ల క్రితం "తుని" లో చదువుకునేటప్పుడు తన స్నేహితులతో కలిసి చర్చించిన పధకం అది.

అది విన్న క్షణం లో అందరి లోనూ గగుర్పాటు, భయం. పోలీసులు కనిపిస్తే హడలిపోయే ప్రజలు, వాళ్ల బూటు కాళ్లతో తన్నులు తినడానికి అలవాటు పడిపోయిన ప్రజలు. "ఆయుధాల కోసం పోలీస్ స్టేషన్ల పై దాడి" అన్న ఆలోచనే వారి ఊహకందని విషయం.
కానీ మరుక్షణం తేరుకున్నారు. ఎందుకంటే తమ ముందుండి నడిపించేది....సాక్షాత్తూ తమ స్వామి.
గాం గంటందొర, ఎండు పడాల్, శ్రీ రామరాజుల నాయకత్వం లో మూడు బృందాలు ఏర్పడ్డాయ్. మరునాడు "చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి" కి ముహూర్తం పెట్టాడు రాజు. అందుకు నాందిగా మహారుద్రాభిషేకం చేశాడు రాజు. వ్యూహం సిద్ధమైంది.
************************************************************************

1922, ఆగస్ట్ 22

జవాను తో కలిసి నర్సీపట్నం వెళుతున్న ఈరెన అప్పల్నాయుడు స్వామి ని కలిసి, తాము చింతపల్లి స్టేషన్ మీద దాడి చేయబోతున్న విషయం చెప్పాడు రాజు. అదిరిపడ్డ ఆ అప్పల్నాయుడు ఎదురు చెప్పలేక మెల్లగా జారుకున్నాడు. అతనెవరో కాదు చింతపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్.మధ్యాహ్నం మూడు గంటల సమయం, సుమారు మూడొందల మంది కొండదళం, చేతుల్లో విల్లమ్ములు, కొడవళ్ళు, ఈటెలు, బరిసెలు, నాటు తుపాకులు లతో చుట్టు ముట్టింది కొండమీది పోలీస్ స్టేషన్ ని. కాపలా ఉన్న పోలీస్ లని స్థంభానికి కట్టేశారు. స్టేషన్ లోని కుర్చీ లో కూర్చొన్న రాజు, దొరికిన తుపాకుల్నీ, తూటాలనీ, బాయినెట్లనీ అక్కడికక్కడే సహచరులకి పంచేశాడు.

స్టేషన్ డైరీ లొ ఉత్తరం రాసి సంతకం చేశాడు.

"అల్లూరి శ్రీరామరాజు అను నేను  నా సహచరులతో ఈ పోలీస్ స్టేషన్ ని ముట్టడించి, సెంట్రీని ఆయుధాగారం గది తాళాలు అడిగాను. తాళాలు ఇవ్వడానికి అతను అంగీకరించలేదు. స్థంభానికి కట్టి వేసి తాళాలు తీసుకున్నాను. ఆయుధాలు సేకరించబడినాయి."

-- అల్లూరి శ్రీ రామరాజు [సంతకం]

పోలీసుకు కనిపిస్తే కాళ్ళు తడుపుకునే కొండదళం, వాళ్ల కేంద్రం మీదనే దాడి చేసింది. కొడతానని ముందే చెప్పి, గురి తప్పకుండా  ప్రధాన పోలీస్ కేంద్రాన్ని కొట్టింది. విజయానందం తో బయటకొచ్చారు దళ సభ్యులు. ఆర్తనాదాలకే అలవాటు పడ్డ వారి చేత ఉత్సాహం పెల్లుబికేటట్టుగా, మొదటిసారిగా విజయ నినాదాలు చేయించాడు రామరాజు.

"గాంధీజీ కీ "


"జై...."


"వందేమాతరం"


"మనదే రాజ్యం"


మన్యం గ్రామాలు తిరుగుతూ దారిలో కనిపించిన పోలీసుల దగ్గర ఆయుధాలని కూడా స్వాధీనం చేసుకున్నారు. పర్యటిస్తున్న ప్రతీ గ్రామం నుండీ ఉత్సాహవంతులైన వీరులు ఉద్యమం లోకి వచ్చి చేరారు.
కృష్ణదేవీ పేట చేరుకుంది కొండదళం. సూచన గా గాల్లోకి కాల్పులు జరిగాయ్.

కొండదళం ఊళ్ళోకి చేరుకునే విషయం ముందే తెలిసిన ఊరి ప్రజలందరూ ఇళ్లకి తాళాలేసుకున్నారు, రాజు కి అత్యంత సన్నిహితుడయిన భాస్కరనాయుడు గారితో సహా. పంచాయితీ పాలన కి ఉపాధ్యక్షుడిగా ఉన్నా గానీ, రామరాజు ఉద్యమం బాట పట్టడం ఆయనకి కలవరం కలిగించింది. తెల్లవారితో విరోధం తన వల్ల కాదని తన నిస్సహాయతని చెప్పేశారు భాస్కర నాయుడు గారు.

ఇందుకు కారణం లేకపోలేదు. ఫితూరీ (ఉద్యమాలు) వారికి కొత్త కాదు. అవన్నీ మరిచిపోవాల్సిన పీడకలలు. గర్రమండ మంగరాజు ఫితూరీ, గొలుగోండ లో శాంతభూపతి, ద్వారబంధాల చంద్రారెడ్డి పితూరీ, రేకపల్లి లో అంబుల రెడ్డి ఫితూరీ.. ఇవన్నీ రామరాజు కంటే ముందు మొదలయ్యి హింసా, రక్తపాతాలతో నిండిపోయి, అణగారిపోయిన, అణగదొక్కబడిన ఉద్యమాలు.

 క్రమశిక్షణ లేని అనుచరులు, శిక్షణ లేని సహచరుల తో కూడిన లక్ష్యం లేని ఉద్యమాలు సామాన్య ప్రజల మీద పడి దోచుకున్నాయి. ఉద్యమం మొదలెట్టిన నాయకులు ఉన్నతాశయాల తో ఉన్నాగానీ, ఈ కారణాల వల్ల బందిపోట్లుగా చిత్రించబడి ఉరికొయ్యలకి వేళ్ళాడారు.

ఇది దొరతనం మీద వ్యతిరేకత తో చేసే స్వాతంత్ర్య పోరాటం తప్ప, అల్ప ప్రయోజనాలకోసం చేసే ఉద్యమం కాదనీ, "ఇది కృష్ణదేవి పేట నమ్మిన శ్రీ రామరాజు మాట" అని ఊరంతా చాటింపు వేయించారు రాజు. తమందరికీ రెండు పూట్లకి సరిపడ భోజన సామగ్రిని మాత్రం ఇవ్వవలసిందిగా కోరారు.

జనం కదిలొచ్చారు. గుమిగూడారు. అంతకు ముందు తెల్లని పంచ అడ్డుకట్ట వేసి, యోగిలా కనిపించే శ్రీ రామరాజు ఖాకీ నిక్కరు, ఖాకీ చొక్క, మెడలో తూటాల దండ తో(పోలీస్ స్టేషన్ లో స్వాధీనం చేసుకున్నవి), చెప్పులు లేని కాళ్ల తో ఎవరో వాల్చిన మంచం మీద కూర్చొన్నారు.  యుద్ధం లో అలసి, సేద తీరుతున్న సైనికుడి లా కనిపిస్తున్నారాయన. చుట్టూ ప్రధాన అనుచరులు. ఆ వెనక వేరు వేరు విచిత్ర వస్త్ర ధారణలతో, రక రకాల తెగలకి చెందిన కొండ జాతి వీరులు.

పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశిస్తే కాల్చేస్తామని చెప్పారు కృష్ణదేవీ పేట స్టేషన్ సిబ్బంది. అలా అయితే తలపడటానికి సిద్ధంగా ఉండమని బెదిరించి, మనుషుల్ని పంపి ఆయుధాలని స్వాధీన పరుచుకున్నారు రాజు.

ఆ మరుసటి రోజే "రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్" మీద దాడి జరిపింది రామరాజు దళం. అప్పటికే పోలీసులు అప్రమప్తం అవడంతో పోలీసుల కాల్పులు స్వాగతం చెప్పాయ్. 36 రౌండ్ల కాల్పుల తర్వాత, పోలీసులు లొంగిపోవటంతో, ఆయుధాలు స్వాధీనమయ్యాయి. అంతే కాదు గతం లో జరిగిన ద్వారబంధాల చంద్రయ్య ఫితూరీ లో పాల్గిన్నందుకు అరెస్ట్ కాబడీ, విచారణకి నోచుకోకుండా స్టేషన్ లో మగ్గుతున్న మరొక ప్రముఖ మన్యం వీరుడు "మొట్టడం వీరయ్య దొర" ని చెర నుండి విడిపించాడు రాజు.

1922,ఆగస్ట్ 28 న ఆంధ్రపత్రిక లో ఈ దాడిని గురించిన కధనం ప్రచురించబడింది.

{ http://www.pressacademyarchives.ap.nic.in  ఈ లింక్ లో తేదీని, ఆంధ్రపత్రిక ని సెలెక్ట్ చేసుకొని పై కధనాన్ని చూడవచ్చు.లేక ఇక్కడ క్లిక్ చేసి ఆ ఆర్టికల్ ని చదవ వచ్చు.}

1922, august 28 నా రాజమండ్రి నుండి వెలువడే కాంగ్రెస్ పత్రిక లోనూ , 1922 సెప్టేంబరు 2 న మచిలీపట్నం నుంచి కృష్ణపత్రిక లోనూ "ఒక యువ క్షత్రియ నాయకుడు కోయతెగ ప్రజల్లో సహాయ నిరాకరణని వ్యాప్తి చేస్తూ స్వాతంత్ర పోరాటాన్ని చేస్తున్నాడని" కధనాలు వెలువడ్డాయి.ఆ రోజు వరకూ మన్యం గ్రామాల్లో మాత్రమే సుపరిచితమైన "అల్లూరి శ్రీ రామరాజు" పేరు మన్యాన్ని దాటి బయటకి వచ్చింది.
రామరాజు ఎవరో, అతని సామర్ధ్యం ఏంటో, మైదాన ప్రాంతం లోని సాధారణ ప్రజలకి తెలిసింది. దొరతనానికి చెంప చరిచిన అనుభవమయ్యింది.

నర్సీపట్నం దగ్గర తిరుగు బాటు జరిగిందనీ, ఆయుధాలని దోచుకున్నారనీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదనీ, గతం లో కొంతకాలం ఇంటరన్ అయ్యి, నేపాల్ యాత్రకి అనుమతి పొందిన రామరాజు దీనికి నాయకుడనీ, కారణాలు తెలియలేదనీ మద్రాస్ లోని ప్రభుత్వ కార్యదర్శి R.A గ్రాహం కు టెలిగ్రాం వెళ్ళింది. తిరుగుబాటు అణచడానికి స్పెషల్ ఆఫీసర్ల నేతృత్వం లో ,అధిక సంఖ్యలో పోలీస్ దళాలని మన్యం వైపు పంపించడానికి ఏర్పాట్లు జరిగాయి...!

మరి.... ఆ అదనపు పోలీస్ దళాలని రాజదండు తట్టుకోగలిగిందా??

14 comments:

Priya said...

రాజ్ గారు.. మీరిలాటి సీరియస్ విషయాల గురించి కూడా ఇంత బాగా రాయగలరనుకోలేదు..! నిజం చెప్పాలంటే నాకు పెద్ద ఇంటరెస్ట్ ఉండదు కాని మీరు ఎంత బాగా రాస్తున్నారంటే ఎప్పుడెపుడు నెక్స్ట్ పోస్ట్ రాస్తారా అని ఎదురు చూసేంత! ఇంత మంచి విషయాలు రాస్తున్నందుకు థాంక్స్ అండి.. :)

పల్లా కొండల రావు said...

well writing and interesting. waiting for next post !

Manasa Chamarthi said...

Bravo!
Gripping narration! Awaiting next part!

Sravya V said...

Very well written !

సుభ/subha said...

ఉత్కంఠగా చదివింపచేస్తున్నారు రాజ్.. తరువాతి టపా???

Khadeerbabu said...

nice

ఫోటాన్ said...

Super Narration Raj!

Raviteja said...

సూపర్! చాలా బాగా వ్రాశారు

Anonymous said...

మీరు ఈ సిరీస్ మొదలుపెట్టినప్పుడు మొదటి 2 ల్లైన్లు చదివి ఇంకో ఘోర వీర సినిమా చూసినట్టున్నారు, గొప్ప రివ్యూ రాసి పండగ చేస్తారు అనుకున్నాను. కాని, you are just exceptional with this piece. ఆంధ్ర పత్రిక న్యూస్ రిపోర్ట్ చూస్తే కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఆ భాషలో మర్యాద, ప్రజల మనోభావాలకి గౌరవం ఇవ్వటం చూసి. అదే ఇప్పుడైతే మన టీవీ 9, ఏబీఎన్ ఏమి చేసేవా అనిపించి ఒక్క క్షణం పొట్టలో తిప్పింది. ఒక జాతిగా
ఆత్మ గౌరవం మర్చిపోయిన మనకి ఇలాంటి నిజమైన హీరోలని మళ్ళీ తలుచుకోవటం చాలా అవసరం. ఆ పని మీరు చాలా బాగా చేస్తున్నారు. Can't wait for more.

Lakshmi

V.L.RaghavaRao said...

krishna assadhydu cinemalo alluri seeta ramaraju naatakaanni srisri gaaru vraasaaru. andulo
dvaara bandhaala chandrayya prasthaavana, TELANGANa VENkAYYAA prasthhavana vastundi. VENkAYYA
potos or charitra unte pampagalaru. mee krushi abhinandaneeyam

V.L.Raghava Rao 9849448947 Rao.wowkim.raghava@gmail.com

V.L.RaghavaRao said...

Super Star Krishna gaari asaadhyudu cinemala alluri seetaa ramaraju naaticanu srisri gaaru
vraasaaru. andulo dvaarabandhaala chandrayya, telangana venkayyala prasthavana tecchaaru.
telangaana venkayya potos or samaachaarm unte pampagalaru/
V.L. Raghava Rao 9849448947 Rao.wowkim.raghava@gmail.com

V.L.RaghavaRao said...

Super Star Krishna gaari asaadhyudu cinemala alluri seetaa ramaraju naaticanu srisri gaaru
vraasaaru. andulo dvaarabandhaala chandrayya, telangana venkayyala prasthavana tecchaaru.
telangaana venkayya potos or samaachaarm unte pampagalaru/
V.L. Raghava Rao 9849448947 Rao.wowkim.raghava@gmail.com

V.L.RaghavaRao said...

Super Star Krishna gaari asaadhyudu cinemala alluri seetaa ramaraju naaticanu srisri gaaru
vraasaaru. andulo dvaarabandhaala chandrayya, telangana venkayyala prasthavana tecchaaru.
telangaana venkayya potos or samaachaarm unte pampagalaru/
V.L. Raghava Rao 9849448947 Rao.wowkim.raghava@gmail.com

V.L.RaghavaRao said...

Super Star Krishna gaari asaadhyudu cinemala alluri seetaa ramaraju naaticanu srisri gaaru
vraasaaru. andulo dvaarabandhaala chandrayya, telangana venkayyala prasthavana tecchaaru.
telangaana venkayya potos or samaachaarm unte pampagalaru/
V.L. Raghava Rao 9849448947 Rao.wowkim.raghava@gmail.com
30-4-2019